ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : మార్కాపురం: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ పబ్లిక్ కార్యక్రమంలో ఓ మహిళ యొక్క హిజాబ్ ను లాగడంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సయ్యద్ జావీద్ అన్వర్ మంగళవారం న ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళా లోకానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.నితీష్ కుమార్ తన ప్రవర్తనను మార్చుకోవాలని,లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ నేత సయ్యద్ జావీద్ అన్వర్ సూచించారు..
Admin
ANDHRA TIMES NEWS